Header Banner

భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు..! చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి!

  Mon May 19, 2025 11:22        India

భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్.. ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్‌తో సోమవారం టెలిఫోన్‌లో కీలక చర్చలు జరిపారు. ఈ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ముఖ్యంగా చాబహార్ పోర్ట్ అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ) వంటి కీలక ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఇరాన్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి, ముఖ్యంగా వ్యూహాత్మకమైన చాబహార్ పోర్టును అభివృద్ధి చేయడంలోనూ, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లడంలోనూ భారత్ ఎంతో ఆసక్తిగా ఉందని అహ్మదియాన్‌కు వివరించినట్లు సమాచారం.

చాబహార్ పోర్ట్, ఐఎన్ఎస్‌టీసీ ప్రాజెక్టులు భారత్‌కు వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో నేరుగా వాణిజ్య సంబంధాలను నెరపడానికి చాబహార్ పోర్ట్ భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. అదేవిధంగా, ఐఎన్ఎస్‌టీసీ ద్వారా రష్యా, ఐరోపా దేశాలకు సరుకు రవాణా సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల పురోగతి వేగవంతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaIranTies #ChabaharPort #AjitDoval #StrategicTalks #TransportCorridor #Geopolitics #IndiaForeignPolicy